జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై స్పందించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడిని ఖండించారు. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు దేశంలో.. ముఖ్యంగా విశ్వవిద్యాలయ్యాల్లో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
"గతరాత్రి జేఎన్యూ వర్సిటీలో జరిగిన ఘర్షణను ఖండిస్తున్నా. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, వామపక్ష పార్టీలు దేశంలో, ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో హింసను, అశాంతిని రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరగాలి."