తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా, ప్రియాంక గాంధీలపై కేసు నమోదు - తెలుగు తాజా జాతీయం వార్తలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి.. ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,​ ప్రియాంక గాంధీ, అసదుద్దీన్​ ఓవైసీ తదితరులపై కేసు నమోదైంది. ఉత్తర్​ప్రదేశ్​లోని సీజేఎమ్​ కోర్టులో న్యాయవాది ప్రదీప్​ గుప్తా ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

Complaint filed against Sonia, Priyanka, Owaisi for giving provocative speeches against amended Citizenship Act
సోనియా, ప్రియాంక గాంధీలపై కేసు నమోదు

By

Published : Dec 24, 2019, 5:46 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులపై కేసు దాఖలైంది. ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​​ చీఫ్​ జుడీషియల్​ మేజిస్ట్రేట్ (సీజేఎమ్​)​ కోర్టులో న్యాయవాది ప్రదీప్​ గుప్తా ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులో ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ, జర్నలిస్ట్​ రవీశ్​ కుమార్​ పేర్లు ఉన్నాయి. ఫిర్యాదును అంగీకరించిన న్యాయస్థానం.. జనవరి 24న వాదనలు విననుంది.

ఇదీ చదవండి: ప్రస్థానం: నాడు ఎమ్మెల్యేగా ఓటమి.. నేడు రెండోసారి సీఎం!

ABOUT THE AUTHOR

...view details