తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ పోలీసులకు చిక్కిన జైషే ఉగ్రవాది సజ్జద్​​

జైషే మహమ్మద్​ ఉగ్రవాది సజ్జద్​ ఖాన్​ అరెస్టయ్యాడు. దిల్లీలో సజ్జద్​ను ప్రత్యేక విభాగం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పుల్వామా ఘటన సూత్రధారి ముదసిర్​కు సజ్జద్​​ అత్యంత సన్నిహితడు.

By

Published : Mar 22, 2019, 5:02 PM IST

దిల్లీ పోలీసులకు చిక్కిన జైషే ఉగ్రవాది సజ్జద్​​

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదసిర్​కు అత్యంత సన్నిహితుడు, జైషే మహమ్మద్​ ఉగ్రవాద సంస్థ కీలక సభ్యుడు సజ్జద్​ ఖాన్​ దిల్లీలో అరెస్టయ్యాడు. పుల్వామా నివాసితుడు సజ్జత్​ గురువారం రాత్రి లజ్​పత్​ రాయ్​ మార్కెట్​ సమీపంలో దిల్లీ ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కాడు.

దిల్లీలో స్లీపర్​ సెల్స్​ ఏర్పాటుకు సజ్జద్ ఖాన్​కు ముదస్సిర్​ ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరిలో శ్రీనగర్​ నుంచి జమ్ముకు వెళుతున్న సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​పై జైషే తీవ్రవాది దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మృతి చెందారు.

ఇదీ చూడండీ:జమ్ముకశ్మీర్ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details