తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ

బంగాల్​లో భాజపా చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కోల్​కతాలో జరిగిన భారీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవటంపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా నినాదాలు చేస్తూ పోలీసులపై రాళ్లు విసిరారు.

By

Published : Jun 12, 2019, 4:08 PM IST

Updated : Jun 12, 2019, 5:24 PM IST

పెళ్లి

బంగాల్​లో ఉద్రిక్త పరిస్థితులు

బంగాల్​లో నానాటికీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. సార్వత్రిక సమరం ముగిసినా అధికార తృణమూల్​ పార్టీ, భాజపా మధ్య ఘర్షణ వాతావరణం చల్లారలేదు. తాజాగా రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులకు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

కోల్​కతాలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్యకర్తలు బావ్​బజార్​ క్రాసింగ్​కు చేరుకునేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆగ్రహించిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీసులపైకి రాళ్లు విసిరారు. అనంతరం అక్కడే బైఠాయించి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు.

కొత్తగా గెలిచిన 18 ఎంపీలతో పాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ ర్యాలీలో పాల్గొన్నారు. సీనియర్​ నేత​లు కైలాశ్ విజయవర్గీయ, ముకుల్​ రాయ్​ కూడా ఉన్నారు. బషీర్​హట్​ ఘటనపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీని విమర్శించారు ముకుల్ రాయ్. ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: బెంగాల్​లో బాంబుల మోత.. భయంలో స్థానికులు

Last Updated : Jun 12, 2019, 5:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details