సరిహద్దులో చైనా దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. చైనాకు ఎక్కడా అవకాశమివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు వెంబడి ఉన్న లోతైన ప్రాంతాల్లో పీఎల్ఏ కదలికలను పసిగట్టిన భారత సైన్యం.. అక్కడ కూడా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం.
"పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. మరో ప్రయత్నానికి చైనా ఉపక్రమించే అవకాశముంది. ఈ నేపథ్యంలో లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కఠిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో.. అసిఫిల, టుటింగ్ యాక్సిస్, ఫిష్ టైల్-2 ప్రదేశాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలపై భారత్ ఓ కన్నేసి ఉంచింది."
--- సైనిక వర్గాలు.
ఇదీ చూడండి-సరిహద్దులో భారత్ దేనికైనా రె'ఢీ': రాజ్నాథ్