తూర్పు లద్దాక్లో చెలరేగిన సరిహద్దు వివాదాన్ని భారత్ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ప్రతిపాదించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో ఫోన్లో మాట్లాడిన వాంగ్ యీ... వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, ప్రశాంతత కొనసాగించేందుకు విభేదాలు పక్కన పెట్టాలని, సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఇంతకు ముందు కుదిరిన ఒప్పందాలను ఇరుదేశాలు పరస్పరం గౌరవించాలని పునరుద్ఘాటించారు వాంగ్.
ప్రణాళిక ప్రకారమే చేశారు..
గాల్వన్ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిందని జైశంకర్ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు చైనా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
సైనికులను అదుపులో ఉంచండి..
అయితే భారత సైనికులే హద్దు మీరారని, అందువల్ల వారిని అదుపులో ఉంచి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వాంగ్ యీ కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది.