కరోనా వైరస్కు సంఘీభావం తెలుపుతూ.. జిన్పింగ్కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాయడాన్ని చైనా అభినందించింది. వందలాదిమంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో తమకు బాసటగా నిలవాలన్న మోదీ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంజ్ షువాంగ్ ప్రకటన విడుదల చేశారు. కరోనాను అరికట్టేందుకు భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
" కరోనాతో చేస్తున్న పోరాటంలో మాకు అండగా నిలిచినందుకు భారత్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ చర్యలు మా ఇరుదేశాల మధ్య ఉన్న మైత్రికి నిదర్శనం."
- గెంజ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి