తెలంగాణ

telangana

ETV Bharat / bharat

85 మందికి లీటరు పాలు- బకెట్​ నీళ్లు కలిపి మేనేజ్​! - లీటర్​ పాలల్లో బకెట్ నీళ్లు

లీటర్​ పాలు ఎంతమంది తాగుతారు? మహా అంటే నలుగురు.. కొద్దిమేర నీళ్లు కలిపితే మరో ఇద్దరికి సరిపోతాయేమో..! ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం 85 మంది పిల్లలకు లీటర్​ పాలతో సరిపెట్టారు.

Children served 1 litre milk diluted in 1 bucket water in UP's Sonbhadra
Children served 1 litre milk diluted in 1 bucket water in UP's Sonbhadra

By

Published : Nov 29, 2019, 11:17 AM IST

Updated : Nov 29, 2019, 1:32 PM IST

85 మందికి లీటరు పాలు- బకెట్​ నీళ్లు కలిపి మేనేజ్​!

మధ్యాహ్నం భోజన పథకం అమలులో ఓ పాఠశాల నిర్వాకం చూస్తే ఆశ్చర్యపోతారు. ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కలిపి లీటరు పాలు ఇచ్చారు.

పాలు అందుబాటులో లేవంటూ.. లీటరు పాలల్లో ఏకంగా బకెట్​ నీళ్లు కలిపి వేడి చేశారు. వాటిని పిల్లలతో తాగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా... ఈ విషయం జిల్లా అధికారుల దృష్టిలో పడింది. సోన్​భద్ర ప్రాథమిక శిక్షా అధికారి గోరఖ్​నాథ్​ పటేల్​ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

"పాలు అందుబాటులో లేవని నాకు చెబుతున్నారు. అందువల్ల నీటిని సమతుల్య పరిమాణంలో కలపాలని వారికి అధికారులు ఆదేశించారట. ఉపాధ్యాయులు మరిన్ని పాలు తీసుకురావడానికి వెళ్లారని నాకు చెప్పారు. ఆ లోపు సమయంలో ఇందుకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాం. తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం."

-గోరఖ్​నాథ్ పటేల్​, ప్రాథమిక శిక్షా అధికారి

గతంలోనూ...

ఇదే తరహాలో మీర్జాపుర్​లో గత ఆగస్టులో ఓ వీడియో వైరల్​ అయింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చపాతీలు, ఉప్పుతో పిల్లలకు వడ్డించారు. ఈ వీడియో తీసిన వ్యక్తిపై అప్పుడు కేసు నమోదు చేశారు.

Last Updated : Nov 29, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details