తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 6:34 PM IST

Updated : Oct 19, 2020, 7:29 PM IST

ETV Bharat / bharat

డబ్బులు లేక మూడు రోజుల తర్వాత తల్లి అంత్యక్రియలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుమారుల వద్ద డబ్బు లేని వైనం. వెరసి ఆ తల్లి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కుమారులకు మూడు రోజుల సమయం పట్టింది. ఈ ఘటన బెల్గాం కర్ణాటక లో జరిగింది.

Children Finished the Mother's Funeral After Three Days of Death Due to the Lack of Money
డబ్బులు లేక మూడు రోజుల తర్వాత తల్లి అంతిమక్రియలు

డబ్బులు లేక మూడు రోజుల తర్వాత తల్లి అంత్యక్రియలు

కర్ణాటక బెల్గాంకు చెందిన భారతి బస్తవద్కర్​ అనే మహిళ అంతమసంస్కారాలు చేయడానికి ఆమె కుమారులకు మూడు రోజుల సమయం పట్టింది. అనారోగ్యం కారణంగా భారతి ఈ నెల 16న బిమ్స్​ ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో సరైన వైద్యం అందక మరణించింది.

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఆమె కుమారులు ఇరువురూ నిరుద్యోగులుగా మారారు. దీంతో వారి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆసుపత్రికి ఫీజు కట్టలేకపోయారు. తెలిసిన వారి దగ్గర అడిగినా ఫలితం లేకపోయింది. మొత్తం చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది అనడంతో మూడు రోజుల పాటు వేచి చూశారు ఆ కుమారులు.

ఈ తరుణంలో అన్నదమ్ముల బాధను గుర్తించిన ఓ స్వచ్ఛంద సంస్థ సాయం చేసింది. చివరకు మూడు రోజుల తర్వాత దహన సంస్కారాలు చేశారు.

ఇదీ చూడండి: కలైమామణి డాక్టర్ ఆర్‌బీఎన్‌ కన్నుమూత

Last Updated : Oct 19, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details