తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2019, 6:14 PM IST

Updated : Nov 15, 2019, 7:24 PM IST

ETV Bharat / bharat

సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు.

సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు

సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, సుప్రీంకోర్టు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ రంజన్ గొగొయి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్​ బోబ్డే నవంబర్​ 18న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇంటర్వ్యూలకు నో..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీవిరమణ చేస్తున్న రంజన్​ గొగొయి​.. పాత్రికేయులతో ముఖాముఖి (ఇంటర్వూలు)లకు నిరాకరించారు. మీడియాకు రాసిన మూడు పేజీల లేఖలో తన హయాంలో... వదంతులు, అసత్యాలు వ్యాప్తిచెందకుండా నివారించడంలో మీడియా పరిపక్వత ప్రదర్శించిందని ప్రశంసించారు.

న్యాయవ్యవస్థలో గోప్యత, స్వేచ్ఛల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రంజన్ ​గొగొయి అభిప్రాయపడ్డారు. దీని అర్థం న్యాయమూర్తులు మౌనంగా ఉండమని కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈశాన్యం నుంచి..

ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి జస్టిస్ రంజన్ గొగొయి కావడం విశేషం. ఈ 46వ సీజేఐ.. పత్రికల ద్వారా ప్రజలను చేరుకోవాల్సిన అవసరం సుప్రీంకోర్టుకు, న్యాయమూర్తులకు లేదని అభిప్రాయపడ్డారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అలాంటి అవసరం ఏర్పడవచ్చన్నారు.

ఇదీ చూడండి: బూతు బొమ్మలు చూస్తే ఇక సీబీఐ కేసులే!

Last Updated : Nov 15, 2019, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details