తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చిదంబరంపై బలవంతంగా చర్యలు తీసుకోవద్దు'

ఐఎన్​ఎక్స్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని, ఆయన తరపు న్యాయవాదుల బృందం కేంద్ర దర్యాప్తు సంస్థను కోరింది. చిదంబరం బెయిల్ పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించి, ఆదేశాలు జారీ చేసే వరకు వేచి ఉండాలని సీబీఐకి విజ్ఞప్తి చేసింది. నేడు చిదంబరం బెయిల్ పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది.

'చిదంబరంపై బలవంతంగా చర్యలు తీసుకోవద్దు'

By

Published : Aug 21, 2019, 10:16 AM IST

Updated : Sep 27, 2019, 6:11 PM IST

మాజీ కేంద్రమంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారించి, ఆదేశాలు ఇచ్చే వరకు... ఆయనపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అతని తరపు న్యాయవాదుల బృందం సీబీఐని కోరింది.

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను నిన్న దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రెండుసార్లు చిదంబరం ఇంటికెళ్లినా ఆయన లేకపోవడం వల్ల వెనుదిరిగారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. వెంటనే తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

సుప్రీంలో బెయిల్ పిటిషన్

సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు సుప్రీంకోర్టు ఈ బెయిల్​ పిటిషన్​ను విచారించనుంది. చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది, పార్టీ సహచరుడు కపిల్ సిబల్​ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం వాదనలు వినిపించనుంది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసు

2007లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో... ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపునకు రూ.305 కోట్ల విదేశీ నిధులు అందాయి. అయితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్టు (ఎఫ్​ఐపీబీ) క్లియరెన్స్​ విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా సీబీఐ 2017 మే 15న ఐఎన్​ఎక్స్​ మీడియాపై కేసు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే మీడియా గ్రూపుపై 2018లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: గుండెపోటుతో మధ్యప్రదేశ్​ మాజీ సీఎం బాబూలాల్ మృతి

Last Updated : Sep 27, 2019, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details