తెలంగాణ

telangana

చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీం తీర్పు

By

Published : Dec 4, 2019, 5:13 AM IST

Updated : Dec 4, 2019, 7:15 AM IST

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత పి.చిదంబరం బెయిల్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. నవంబర్ 28న తీర్పు వాయిదా వేసిన జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తుది తీర్పు ఇవ్వనుంది.

chidambaram
చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీం తీర్పు

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. బెయిల్‌ నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు నవంబర్‌ 15న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారుచిదంబరం. ఈ వ్యాజ్యంపై నవంబర్‌ 28న వాదోపవాదనలు విన్న జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది.

ఈడీ వాదనలు

కస్టడీలో ఉన్నప్పటికీ.. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కోర్టులో వాదించింది. అధికారంలో ఉన్న వారు ఇలాంటి నేరాలకు పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందని ఈడీ తరపు న్యాయవాది, సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.

సాక్ష్యాలు లేవు..

నిరాధార ఆరోపణలతో ఈడీ తన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించకూడదని కోర్టుకు తెలిపారు చిదంబరం. కాంగ్రెస్​ నేత ఈ నేరానికి పాల్పడినట్లు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సాక్ష్యాలు లేవని చిదంబరం తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు.

చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతుల మంజూరులో అవకతవకలకు పాల్పడినట్లు 2017 మే 15న కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు పెట్టింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​.

ఇదీ చూడండి: మూడో అంతస్తు నుంచి పడ్డ బాలుడు.. పట్టేసిన యువకులు

Last Updated : Dec 4, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details