తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెయిల్​ కోసం దిల్లీ హైకోర్టుకు చిదంబరం

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్​ కోరుతూ పిటిషన్​ దాఖలు చేశారు. తనకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించడాన్ని చిదంబరం సవాలు చేశారు.

బెయిల్​ కోసం దిల్లీ హైకోర్టుకు చిదంబరం

By

Published : Sep 11, 2019, 2:15 PM IST

Updated : Sep 30, 2019, 5:39 AM IST

బెయిల్​ కోసం దిల్లీ హైకోర్టుకు చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియాకు సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్​ కోరుతూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించిన ట్రయిల్​ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మరో పిటిషన్​ దాఖలు చేశారు.

73ఏళ్ల కాంగ్రెస్​ నేతను ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. చిదంబరంపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని.. అందుకే కస్టడీకి అప్పగించినట్టు ట్రయిల్​ కోర్టు తెలిపింది. కేంద్ర మాజీ మంత్రిని అధికారులు తిహార్​ జైలుకు తరలించారు.

యూపీఏ హయాంలో మంత్రిగా ఉండగా... విదేశీ నిధులు పొందేందుకు ఐఎన్​ఎక్స్​ మీడియాకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్నది చిదంబరంపై ఉన్న ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి:- పూలు అమ్మినచోటే కట్టెలు అమ్ముతున్న నేత

Last Updated : Sep 30, 2019, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details