తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నైలోని ఓ వ్యక్తి చెట్ల కోసం అంబులెన్స్​ను ఏర్పాటు చేశాడు. మే 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రారంభమైన 'చెట్టు అంబులెన్స్'​ మొక్కల పంపిణీ, చెట్లను తరలించడం, చనిపోయిన వృక్షాలను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపడుతుంది.

By

Published : Jun 5, 2019, 9:19 PM IST

Updated : Jun 6, 2019, 12:03 AM IST

చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్

చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ వ్యక్తి. చెట్ల పరిరక్షణ కోసం ఓ అంబులెన్స్​ను ఏర్పాటుచేశాడు. విత్తనాలు, మొక్కల పంపిణీ, నాటడంలో సహాయం, చెట్లను తరలించడం, సర్వే చేయడం, చనిపోయిన వృక్షాలను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపడతారు ఈ అంబులెన్స్​లోని సిబ్బంది.

"అనారోగ్యంతో ఉన్న చెట్ల సంరక్షణ, నేలకూలిన చెట్లకు సహాయమందించడం ఈ చెట్టు అంబులెన్స్ లక్ష్యం. 2020 కల్లా దేశంలోని జిల్లాకో చెట్టు అంబులెన్స్​ను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం."

-అబ్దుల్​ ఘనీ, ట్రీ అంబులెన్స్ సేవల వ్యవస్థాపకుడు

వార్దా, గాజా తుపానుల కారణంగా తమిళనాడులోని అనేక చెట్లు నేలకూలి వేర్లు బయటకు వచ్చాయన్నారు చెట్టు అంబులెన్స్ సంస్థ అధ్యక్షుడు సురేశ్. 2015లో చెన్నై వరదలను దగ్గరనుంచి చూశానని వెల్లడించారు. ఈ కారణంగానే చెన్నైలో చెట్టు అంబులెన్స్ నడపాలనే అబ్దుల్ ఘనీ ఆలోచనకు మద్దతిచ్చానని తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా చెట్టు అంబులెన్స్​ ఏర్పాటు చేశామన్నారు. ఈ అంబులెన్స్​లో పెద్ద వృక్షాలను వేర్లతో బయటకు తీసే హైడ్రాలిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.

ఉపరాష్ట్రపతిచే ఆరంభం

ఈ చెట్టు అంబులెన్స్​ను ఈ ఏడాది మే 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

Last Updated : Jun 6, 2019, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details