తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మావోల కాల్పుల్లో ఏడుగురు జవాన్ల మృతి

ఛత్తీస్​గఢ్​ సుక్మా అడవుల్లో జిల్లా రిజర్వు గార్డులు, నక్సల్స్​ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్​ కాల్పుల్లో ఏడుగులు గార్డులు మరణించారు. మరో 17మంది ఆచూకీ గల్లంతయింది.

By

Published : Mar 22, 2020, 1:10 AM IST

encounter
ఎదురుకాల్పులు

ఛత్తీస్​గఢ్​ అడవుల్లో మళ్లీ తుపాకుల మోత వినిపించింది. సుక్మా అడవుల్లో జిల్లా రిజర్వ్ గార్డులు, మావోయిస్టుల మధ్య శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ కాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతి చెందారు.

14 మంది పోలీసులకు గాయాలయ్యాయి. మరో 17 మంది ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details