తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో హింస, సమ్మెపై కేంద్రహోంశాఖ ఆరా

బంగాల్​లో రాజకీయ హింస కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. డాక్టర్ల సమ్మెపైనా మరో ప్రత్యేక నివేదిక సమర్పించాలని సూచించింది.

By

Published : Jun 15, 2019, 3:35 PM IST

బంగాల్​లో హింస, సమ్మెపై కేంద్రహోంశాఖ ఆరా

బంగాల్​లో రాజకీయ హింసపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. అల్లర్లు నియంత్రించడం సహా ఆయా ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటివరకు ఏం చేశారో తెలపాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

బంగాల్​లో నాలుగేళ్లలో జరిగిన రాజకీయ ఘర్షణల్లో సుమారు 160 మంది చనిపోవడాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించింది. ఈ స్థాయిలో హింస జరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

వైద్యుల వ్యవహారంపైనా...

ఐదు రోజులుగా బంగాల్​లో జరుగుతున్న జూడాల సమ్మెపైనా కేంద్రం ఆరా తీసింది. ఈ విషయంపైనా ప్రత్యేక నివేదిక సమర్పించాలని రాష్ట్ర​ ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చూడండి: పట్టు వీడని జూడాలు- దీదీ క్షమాపణకై డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details