తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ నుంచి 10 వేల మంది జవాన్ల ఉపసంహరణ

10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్​ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు.

By

Published : Aug 19, 2020, 6:56 PM IST

Centre orders immediate withdrawal of 10,000 troops from J-K
కశ్మీర్​ నుంచి 10వేల మంది బలగాల తక్షణ ఉపసంహరణ

జమ్ముకశ్మీర్​ నుంచి 10 వేల మంది పారామిలిటరీ బలగాల తక్షణ ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సీఆర్​పీఎఫ్​ బలగాల మోహరింపును కేంద్ర హోంశాఖ సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

గతేడాది ఆర్టికల్​ 370రద్దు అనంతరం వీరిని జమ్ముకశ్మీర్​కు తరలించింది కేంద్రం. తాజాగా.. బలగాలు దేశవ్యాప్తంగా ఉన్న తమ శిబిరాలకు తక్షణమే చేరుకోవాలని ఆదేశించింది.

దీని ప్రకారం.. సీఆర్​పీఎఫ్​లోని 40 కంపెనీలు, సీఐఎస్​ఎఫ్​లోని 20 కంపెనీలతో పాటు బీఎస్​ఎఫ్​, ఎస్​ఎస్​బీ బలగాలు.. ఈ వారం చివరిలోగా జమ్మకశ్మీర్​ను వీడుతారు.

తాజా ఉపసంహరణతో.. కశ్మీర్​ లోయలో 60 బెటాలియన్ల(ప్రతి దాంట్లో 1,000 మంది) సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరికి తొడు కొద్దిమంది సీఏపీఎఫ్​ సిబ్బంది ఉండనున్నారు.

ఇదీ చూడండి:-కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం

ABOUT THE AUTHOR

...view details