తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త పార్లమెంటు నిర్మాణ పనులు షురూ - టాటా ప్రాజెక్ట్స్​‌ లిమిటెడ్‌ సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ

సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి మరుసటి రోజును అత్యంత పవిత్రంగా భావించి ఈ నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.

new Parliament building
కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు షురూ

By

Published : Jan 15, 2021, 1:21 PM IST

కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు శుక్రవారం లాంఛనంగా మొదలయ్యాయి. మకర సంక్రాంతి ముగిసిన మరుసటి రోజును పవిత్రంగా భావించి ఈ పనులను ప్రారంభించింది నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన టాటా ప్రాజెక్ట్స్​‌ లిమిటెడ్.

సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనానికి డిసెంబర్​ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకు స్థాపన చేశారు.

ఒకేసారి 1,272 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా త్రిభుజాకారంలో కొత్త పార్లమెంటును నిర్మిస్తున్నారు. లోక్‌సభలో 888మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా ఇది నిర్మితం కానుంది. రూ.971కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం.. గుత్తేదారు సంస్థకు లక్ష్యం నిర్దేశించింది.

ఇదీ చూడండి:సశక్త దేశానికి ఘన ప్రతీక మన పార్లమెంట్​

ABOUT THE AUTHOR

...view details