తెలంగాణ

telangana

పండుగల వేళ విమాన సర్వీసులు పెంపు!

By

Published : Oct 8, 2020, 3:01 PM IST

విమాన సేవలను పెంచేందుకు చర్యలు ముమ్మరం చేస్తోంది కేంద్రం. పండుగల సీజన్​ దృష్ట్యా విమాన సర్వీసులు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Center is planning to increase flights services in view of the festive season
విమాన సర్వీసులు పెంచే యోచనలో కేంద్రం

పండుగ సీజన్​ నేపథ్యంలో విమాన సర్వీసులు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత సంస్థలు, భాగస్వామ్య పక్షాలతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈమేరకు చర్చలు జరుపుతోంది.

విమానయాన సంస్థలు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో సర్వీసులు నడుపుతుండగా.. త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని కేంద్ర మంత్రి హర్‌దీప్‌పూరి అన్నారు. వచ్చే 30-40 రోజుల్లో సామర్థ్యాన్ని 80 శాతానికి పైగా పెంచే అవకాశముందన్నారు.

ఎయిర్​ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు తమ కార్యకలాపాలను పెంచుతాయని పూరి వెల్లడించారు. విస్తారా, గో ఎయిర్ కూడా అదే బాటలో పయనిస్తాయని తెలిపారు.

ఇదీ చూడండి:పాప ప్రాణం కోసం అంబులెన్స్​ డ్రైవర్​ సాహసం!

ABOUT THE AUTHOR

...view details