మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలతోపాటే 18 రాష్ట్రాల్లోని 64 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా కర్ణాటకలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయడం వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
కర్ణాటక తర్వాత అత్యధికంగా ఉత్తర ప్రదేశ్లోని 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. కేరళ, బిహార్లలో ఐదేసి, గుజరాత్, అసోం, పంజాబ్లలో నాలుగేసి స్థానాలకు అక్టోబర్ 21నే ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. సిక్కింలో 3, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడుల్లో రెండేసి, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చేరిల్లోని ఒక్కో స్థానానికి షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ.
తెలంగాణలో...