సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం తన విజయానికి ప్రధాన కారణమన్నారు సీబీఎస్ఈ టాపర్ హన్సికా శుక్లా. సీబీఎస్ఈలో 500 గాను 499 మార్కులతో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకును ఆమె సాధించారు. ఉత్తరప్రదేశ్లోనిఘజియాబాద్లో ఆమె చదువుతున్నారు.
ఆంగ్లంలో కోల్పోయిన ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే బాగుండేదన్నారు హన్సిక.తానెప్పుడూ ట్యూషన్లకు వెళ్లలేదని, క్రమశిక్షణగా ఉంటూ, పాఠశాలలో చెప్పే అన్ని విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఆంగ్లం మినహా మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు సాధించారు హన్సిక.