తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే: సీబీఎస్​ఈ టాపర్​

ఒక్క మార్కు తక్కువగా వచ్చినందుకు కొంత బాధగా ఉందని సీబీఎస్​ఈ టాపర్​ హన్సికా శుక్లా అన్నారు. 500 గాను 499 మార్కులు సాధించిన హన్సిక.. తన విజయ రహస్యాన్ని తెలిపారు.

By

Published : May 2, 2019, 8:47 PM IST

Updated : May 2, 2019, 9:54 PM IST

హన్సిక శుక్లా

సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం తన విజయానికి ప్రధాన కారణమన్నారు సీబీఎస్​ఈ టాపర్​ హన్సికా శుక్లా. సీబీఎస్​ఈలో 500 గాను 499 మార్కులతో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకును ఆమె సాధించారు. ఉత్తరప్రదేశ్​లోనిఘజియాబాద్​లో ఆమె చదువుతున్నారు.

ఆంగ్లంలో కోల్పోయిన ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే బాగుండేదన్నారు హన్సిక.తానెప్పుడూ ట్యూషన్​లకు వెళ్లలేదని, క్రమశిక్షణగా ఉంటూ, పాఠశాలలో చెప్పే అన్ని విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఆంగ్లం మినహా మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు సాధించారు హన్సిక.

హన్సిక శుక్లా, సీబీఎస్​ఈ టాపర్

"మాటలు రావట్లేదు.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు న్యాయం చేశాను. నాకు సైకాలజీలో పీహెచ్​డీ చేయాలని ఆసక్తి. అందుకే ఆ సబ్జెక్ట్​ ఎంపిక చేసుకున్నా. రెండేళ్లుగా ఇండియన్​ ఫారిన్​ సర్వీస్​ కోసం చదవాలని ఆసక్తి పెరిగింది. మార్కుల విషయానికి వస్తే.. 499 రావాలని నేను చదవలేదు. మొత్తం సాధించేయాలని భావించాను."

-హన్సిక శుక్లా, సీబీఎస్​ఈ టాపర్​

ఇదీ చూడండి: ఎందరికో స్ఫూర్తి: గోమతి మరిముత్తు గాథ

Last Updated : May 2, 2019, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details