తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2019, 11:43 AM IST

Updated : Sep 27, 2019, 9:23 AM IST

ETV Bharat / bharat

కర్ణాటక నేతల 'ఫోన్​ ట్యాపింగ్'​పై సీబీఐ దర్యాప్తు

కర్ణాటకలో గత ప్రభుత్వ హయాంలో ఫోన్​ ట్యాపింగ్​ జరిగినట్లు నమోదైన కేసును సీబీఐకి అప్పగించనుంది భాజపా ప్రభుత్వం. ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ విషయం వెల్లడించారు.

కర్ణాటక నేతల 'ఫోన్​ ట్యాపింగ్'​పై సీబీఐ దర్యాప్తు

కర్ణాటకలో రాజకీయంగా చర్చనీయాంశమైన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్​-కాంగ్రెస్​ హయాంలో ఫోన్​ ట్యాపింగ్​ జరిగినట్లు నమోదైన కేసును సీబీఐకి అప్పగించాలని తీర్మానించింది.

"ఫోన్​ ట్యాపింగ్​ సమస్యపై నిజానిజాలు రాబట్టేందుకు సీఎల్పీ నేత సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్​ నేతలు దర్యాప్తునకు డిమాండ్​ చేశారు. కాబట్టి సీబీఐ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించాము. సోమవారం ఆదేశాలు ఇస్తాం. పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష."

- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.

అలా మొదలు...

గతవారం హెచ్​డీ కుమారస్వామి ప్రభుత్వంపై రెబల్​ ఎమ్మెల్యే ఏహెచ్​ విశ్వనాథ్​ రాజకీయ బాంబు పేల్చారు. సుమారు 300మందికిపైగా నేతల ఫోన్​ ట్యాప్​ చేసి, గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి తెలిసే ఫోన్​ ట్యాపింగ్​ జరిగిందని చెప్పారు విశ్వనాథ్​.

కూటమిలో అసమ్మతి నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుమారస్వామి ఈ తతంగాన్ని వెనకుండి నడిపించారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్​ శెట్టర్​.
ఖండించిన కుమారస్వామి...

ఫోన్​ ట్యాపింగ్​ ఆరోపణలను ఖండించారు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. అలాంటి అవసరం తనకు లేదని ట్వీట్​ చేశారు.

ట్యాపింగ్​పై రాజకీయ వేడి రాజుకున్న తరుణంలో యడియూరప్ప సీబీఐ దర్యాప్తు చేపడతామని ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

20న మంత్రివర్గ విస్తరణ

ఈ నెల 20న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు.

ఇదీ చూడండి: దయనీయం: నిరుద్యోగి 'డాక్టర్' ఆకలి వ్యథ!

Last Updated : Sep 27, 2019, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details