తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి సీబీఐ సమన్లు

అక్రమాస్తుల కేసులో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్​కు సీబీఐ సమన్లు జారీ చేసింది. నవంబర్​ 25న విచారణకు హాజరవుతానని డీకేఎస్ తెలిపారు.

By

Published : Nov 21, 2020, 7:17 PM IST

DKS CBI
డీకే శివకుమార్​

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో తనకు నవంబర్‌ 19న సమన్లు వచ్చాయని, ఆ సమయంలో తామెవరూ ఇంట్లో లేనట్టు ఆయన తెలిపారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చేసరికి అధికారులు సమన్లు ఇచ్చారని వివరించారు.

"ఈ నెల 23న సాయంత్రం 4గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అడిగింది. రాష్ట్రంలోని పలు స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందువల్ల ఆ తేదీలో సాధ్యం కాదని చెప్పాను. ఈ నెల 25న తిరిగి వస్తానని, అదేరోజు సాయంత్రం హాజరవుతానని చెప్పాను. అందుకు అధికారులు అంగీకరించారు."

- డీకే శివకుమార్

కేసు ఏంటి?

నవంబర్‌ 19న శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ మనవడు, కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్‌ 5న కర్ణాటక, దిల్లీ, ముంబయిలలో డీకేఎస్‌తో పాటు పలువురికి సంబంధం ఉన్న 14 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.

ఈ సందర్భంగా రూ.57లక్షల నగదుతో పాటు పలు దస్త్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే, శివకుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:ఆదాయం రూ.1000.. కరెంటు బిల్లు 29 వేలు!

ABOUT THE AUTHOR

...view details