తెలంగాణ

telangana

'ఐఎన్​ఎక్స్' కేసులో చిదంబరంపై సీబీఐ ఛార్జ్​షీట్​!

By

Published : Sep 6, 2019, 5:41 AM IST

Updated : Sep 29, 2019, 2:50 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై ఈ నెలలో సీబీఐ ఛార్జ్​షీట్​ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ప్రస్తుతం ఆయన తిహార్​ జైలులో ఉన్నారు.

'ఐఎన్​ఎక్స్' కేసులో చిదంబరంపై సీబీఐ ఛార్జ్​షీట్​!

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కాంగ్రెస్​ నేత పి. చిదంబరంపై ఈ నెలలో సీబీఐ ఛార్జ్​షీట్​ దాఖలు చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల క్లియరెన్స్​ ఇచ్చినట్లు ఆయనపై అభియోగం ఉంది.

తిహార్​ జైలుకు..

ప్రత్యేక న్యాయస్థానం.. చిదంబరానికి 14 రోజుల సీబీఐ జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయనను తిహార్​ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు.. జైలులో ఆయనకు ప్రత్యేక సెల్​, వెస్ట్రన్ టాయ్​లెట్ తప్ప మరే ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని అధికారులు తెలిపారు.

కక్ష సాధింపు చర్యలు

చిదంబరాన్ని జైలుకు తరలించడంపై కాంగ్రెస్ మండిపడింది. భాజపా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ప్రతిపక్షంలోని కొందరు నాయకులను ఎంచుకొని మరీ వారిపై హింసకు పాల్పడుతోందని ఆరోపించింది.

ఇదీ చూడండి: టీచర్స్​ డే: నిష్ఠతో ఉపాధ్యాయ శిక్షణ

Last Updated : Sep 29, 2019, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details