తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2019, 11:57 PM IST

ETV Bharat / bharat

నీరవ్​ను రప్పించేందుకు ప్రయత్నాలు

లండన్​లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీని తిరిగి భారత్​కు​ రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు.

నీరవ్​ను రప్పించేందుకు ప్రయత్నాలు

నీరవ్​ మోదీని భారత్ రప్పించేందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలపై బ్రిటన్​ ప్రభుత్వంతో తరచూ సంప్రదింపులు జరపుతున్నామని సీబీఐ అధికారులు తెలిపారు.

ఎలాగైనా నీరవ్​ని భారత్​కు రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఎన్​పోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారుల వినతి మేరకు నీరవ్​కు సోమవారం అరెస్టు వారెంటు జారీ చేసింది లండన్​ న్యాయస్థానం. బ్రిటన్​ పోలీసులు త్వరలోనే నీరవ్​ను అదుపులోకి తీసుకొని న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రూ. 13వేల కోట్ల పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నీరవ్​తో పాటు మరికొందరిపై అభియోగాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details