తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్​' ప్రమాదంపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం - ఉన్నావ్​

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి కారు ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు 20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఇప్పటికే కేంద్ర ఫొరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​కు చెందిన ఆరుగురు నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

'ఉన్నావ్​' ప్రమాదంపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం

By

Published : Aug 2, 2019, 7:07 PM IST

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి కారు ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఇందుకోసం 20 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్పటికే కేంద్ర ఫొరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​కు చెందిన ఆరుగురు నిపుణుల బృందం ఘటన స్థలానికి చేరుకుంది. ప్రమాదంపై ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు నిపుణులు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారు మాదిరి.. మరో కారుతో ఘటన జరిగిన తీరును పునరావృతం చేసే పనిని ప్రారంభించారు.

లఖ్​నవూలో విచారణ ప్రారంభించిన ఐదుగురు సభ్యుల బృందం సహాయం తీసుకోనుంది ప్రత్యేక బృందం.

ఇదీ చూడండి: 'బాధితురాలి తరలింపుపై కుటుంబానిదే నిర్ణయం'

ABOUT THE AUTHOR

...view details