తెలంగాణ

telangana

ప్రజ్ఞాను ఎప్పటికీ క్షమించను: మోదీ

భోపాల్​ భాజపా అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞాసింగ్​ను ఎప్పటికీ క్షమించబోనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మహాత్మగాంధీని హత్య చేసిన గాడ్సేను దేశ భక్తుడని కీర్తించటం ముమ్మాటికీ తప్పేనన్నారు.

By

Published : May 17, 2019, 5:22 PM IST

Published : May 17, 2019, 5:22 PM IST

మోదీ

భోపాల్​ భాజపా అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞాసింగ్​పై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సేను దేశ భక్తుడని కీర్తించడాన్ని తప్పుబట్టారు. సాధ్వీ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని, ఈ విషయంలో ఎప్పటికీ క్షమించబోనని స్పష్టం చేశారు.

"మహాత్మా గాంధీ లేదా నాథురాం గాడ్సే గురించి అలా వ్యాఖ్యానించటం చాలా తప్పు. ఈ రకమైన వ్యాఖ్యలు సమాజానికీ మంచివి కావు. మన సంస్కృతిలో ఇలాంటి భాషకు స్థానం లేదు. ఇలాంటి పనులకు పాల్పడే వారు వంద సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సాధ్వీ క్షమాపణలు కోరారు. కానీ ఎప్పటికీ ఆమెను క్షమించను."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఇదే రీతిలో స్పందించారు. గాడ్సేకు అనుకూలంగా వ్యాఖ్యానించిన భాజపా నేతలపై అంతర్గత విచారణ కమిటీని నియమించినట్టు తెలిపారు.

ఇటీవల భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. మక్కల్​ నీది మయ్యమ్​ అధినేత కమల్​ హాసన్​ "హిందూ ఉగ్రవాది" ఆరోపణలకు గాడ్సే దేశభక్తుడంటూ సమాధానమిచ్చి వివాదానికి తెరలేపారు సాధ్వీ ప్రజ్ఞ. అనంతరం గాడ్సే విషయం తెరపైకి రావటం సంతోషంగా ఉందని అనంత్​కుమార్ హెగ్దే ట్వీట్​ చేశారు. విమర్శల నేపథ్యంలో ట్విట్టర్​ ఖాతా హ్యాక్​ అయిందని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గాడ్సేతో పోలుస్తూ కర్ణాటక ఎంపీ కటీల్​ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: మోదీ పాలన విద్వేషం, వైఫల్యాలమయం: రాహుల్

ABOUT THE AUTHOR

...view details