తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరికాసేపట్లో ఐదో విడత ఎన్నికలు ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్​ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్​సభ నియోజకవర్గాల్లో ఓటింగ్​ జరగనుంది. హింసాత్మక ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.

By

Published : May 6, 2019, 5:32 AM IST

మరికాసేపట్లో ఐదో విడత ఎన్నికలు ప్రారంభం

మరికాసేపట్లో ఐదో విడత ఎన్నికలు ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్​.. మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఐదో దశలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 51 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ జరుగుతుంది. 674 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 8 కోట్ల 75 లక్షల మంది ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ​సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్​ 4 గంటల వరకే నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాలు పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నాయి. పౌరులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బూత్​ల ముందు బారులుతీరారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 14, రాజస్థాన్​లో 12, పశ్చిమ్​ బంగ, మధ్యప్రదేశ్​లలో 7, బిహార్​లో 5, ఝార్ఖండ్​లో 4, జమ్ములో 2 లోక్​సభ స్థానాలకు ఐదో విడతలో పోలింగ్​ జరగనుంది. రాజస్థాన్​లో ఈ విడతతో ఎన్నికలు ముగియనున్నాయి.

మరికాసేపట్లో ఐదో విడత ఎన్నికలు ప్రారంభం

ఐదో విడతలోనూ జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​ నియోజకవర్గానికి పోలింగ్​ జరగనుంది. ఇక్కడ పుల్వామా, శోపియాన్​ జిల్లాల్లో ఈసారి ఓటింగ్​ నిర్వహిస్తున్నారు. అనంత్​నాగ్​తో పాటూ లద్దాఖ్​ స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

బంగాల్​లో భారీగా బలగాలు...

ఎన్నికల వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రశాంతంగా​ జరిగేలా చర్యలు తీసుకుంటోంది.

మూడు, నాలుగో దశ ఎన్నిక్లల్లో హింసాత్మక ఘటనలు, అల్లర్లు చోటుచేసుకున్న బంగాల్​లో భద్రత పట్ల ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంది ఈసీ.

పోటీలో ప్రముఖులు...

కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతలు బరిలో ఉన్న కారణంగా.. ఐదో విడత పోలింగ్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీ నుంచి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, రాయ్​బరేలీలో ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ పోటీలో నిలిచారు.

కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​ లఖ్​నవూ, స్మృతి ఇరానీ అమేఠీలో భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. రాజ్యవర్దన్​ సింగ్​ రాఠోడ్​, జయంత్​ సిన్హా, కాంగ్రెస్​ నేత, ఒలింపియన్​ కృష్ణ పునియా ఎన్నికల బరిలో నిలిచారు.

ధీమాగా కాంగ్రెస్​...

ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్​ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లలో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్​.. ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో మళ్లీ పుంజుకోవాలనుకుంటోంది భాజపా.

ABOUT THE AUTHOR

...view details