కర్ణాటక అధికార కూటమిపై వాగ్బాణాలు సంధించారు కేంద్ర రసాయన, ఎరువుల శాఖమంత్రి డీవీ సదానంద గౌడ. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి చేయనున్న మంత్రివర్గ విస్తరణ ప్రయత్నాలు ఫలించవన్నారు. మంత్రివర్గ విస్తరణే అధికార కూటమి పడిపోవడానికి పునాది వేయనుందని జోస్యం చెప్పారు.
"ప్రభుత్వం పడిపోయేందుకు మంత్రివర్గ విస్తరణే పునాది రాయి. అధికార కూటమిలోని అసంతృప్తులు అందరికీ తెలుసు. వారి అంతర్గత వ్యవహారంలో నేను జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న సాహసమే వారికి చివరి విన్యాసం. ఈ సారి అదే వారి కొంప ముంచుతుంది."