తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై అవగాహనకు కేంద్రం మరో కార్యక్రమం

దేశంలో కొవిడ్​ నిర్మూలనకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గురువారం నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది.

By

Published : Oct 7, 2020, 6:02 PM IST

Cabinet decided to launch public awareness campaign on coronavirus: Union Minister Javadekar
కరోనాపై అవగాహన కార్యక్రమానికి కేంద్ర కేబినెట్​ నిర్ణయం

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరో అవగాహనా కార్యక్రమం నిర్వహించనుంది కేంద్రం. మాస్కులు ధరించడం, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటి అంశాలపై గురువారం నుంచి ప్రచారం చేయనున్నట్టు కేంద్రమంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించారు మంత్రి ప్రకాశ్​ జావడేకర్.

వ్యాక్యిన్​ వచ్చేవరకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు జావడేకర్​. రద్దీగా ఉండే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్​డిపోలు, పోలీస్​ స్టేషన్లు, మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఏకకాలంలో ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు జావడేకర్​.

ఇదీ చదవండి:74% మందికి వార్తా ఛానళ్లే వినోదానికి వేదిక

ABOUT THE AUTHOR

...view details