వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రిర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం.. ఈ బిల్లుకు పచ్చ జెండా ఊపింది. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ నుంచి వలసవచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ బిల్లు వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈశాన్య రాష్ట్రాల్లోని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ భయాలను దూరం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు, పౌర, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఇటీవల భేటీ అయ్యారు. వారి సందేహాలను నివృతి చేశారు.