తెలంగాణ

telangana

మరికాసేపట్లో దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు​

By

Published : Oct 21, 2019, 5:18 AM IST

Updated : Oct 21, 2019, 8:06 AM IST

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలకు మరికాసేపట్లో పోలింగ్ జరగనుంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని మరో 51 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్​లో 11 స్థానాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయి.

మరికాసేపట్లో దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​

నేడు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మరో 51 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ 11, గుజరాత్​​ 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్​ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పంజాబ్​ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

అరుణాచల్​ ప్రదేశ్​, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్​గఢ్​, పుదుచ్ఛేరి, మేఘాలయా, తెలంగాణలో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర ప్రదేశ్​లో 30 నెలల అధికారాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు ఈ ఉపఎన్నికలు ఓ పరీక్ష అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పోటీలో సిక్కిం ముఖ్యమంత్రి

భాజపా, దాని మిత్రపక్షమైన ఆర్​ఎల్పీ నుంచి రెండు స్థానాలను కైవసం చేసుకుని రాజస్థాన్ అసెంబ్లీలో.. తమ మెజారిటీని మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సిక్కింలో ప్రస్తుత సీఎం ప్రేమ్​సింగ్​ తమాంగ్​, భారత ఫుట్​బాల్​ మాజీ కెప్టెన్​ బైచుంగ్​ భుటియా ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి : హరియాణా: ఎన్నికలను శాసించే స్థితిలో యువ ఓటర్లు

Last Updated : Oct 21, 2019, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details