కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పాక్తో యుద్ధం మొదలవబోతోందన్న ఊహాగానాల నడుమ సరిహద్దు ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. తూటాలు, షెల్లింగ్ల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లను సిద్ధం చేస్తున్నారు. ఉత్తర కశ్మీర్లోని ఓ బంకర్ను ఈటీవీ భారత్ బృందం సందర్శించింది.
రక్షణ కోసం బంకర్లను సిద్ధం చేస్తోన్న కశ్మీరీలు - షెల్లింగ్
జమ్ముకశ్మీర్లో యుద్ధం వస్తోందన్న వదంతులతో సరిహద్దు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. యుద్ధం మొదలైతే తమను తాము కాపాడుకునేందుకు బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు.
![రక్షణ కోసం బంకర్లను సిద్ధం చేస్తోన్న కశ్మీరీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4033570-thumbnail-3x2-bunker.jpg)
రక్షణ కోసం బంకర్లను సిద్ధం చేస్తోన్న కశ్మీరీలు
తమను తాము కాపాడుకునేందుకు సరిహద్దు ప్రజలు నిర్మించుకున్న బంకర్ల విశేషాలు మీకోసం...
ఉత్తర కశ్మీర్లోని ఓ బంకర్
- భూమిలో 10 అడుగుల లోతులో వీటిని నిర్మిస్తారు.
- లోపలికి వెళ్లేందుకు మెట్లు, బయటికి చూసేందుకు కిటికీ ఉంటుంది
- ఈ బంకర్లో 5 నుంచి 7 సభ్యులు ఉండేందుకు వీలుంటుంది
- మోర్టార్ షెల్లింగ్, తూటాలను తట్టుకుని నిలబడుతుంది
ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: భయం, నిరాశతో స్వస్థలాలకు..