తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో భవనం కూలి ఒకరు మృతి

ముంబయిలోని ధారావీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవంతి కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Apr 15, 2019, 7:30 AM IST

ముంబయి ధారావీలో కూలిన భవనం... ఒకరు మృతి

ముంబయి ధారావీలో కూలిన భవనం

ముంబయి ధారావీ లోని పీఎంజీపీ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుత్తేదారు​ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

"నిర్మాణంలో ఉన్న భవనం నుంచి కొంత భాగం కిందపడింది. అది ఓ ఆటో డ్రైవర్​ మీద పడింది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్​పై అటుగా వెళ్తున్న మరొకరు గాయపడ్డారు."
- నయూమ్​ ఖురేషీ, పీఎంజీపీ కాలనీ వాసి

ABOUT THE AUTHOR

...view details