తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్​ 2019: గ్రామీణ భారతానికి సరికొత్త వన్నెలు

స్వచ్ఛత, డిజిటల్​ అక్షరాస్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ భారతం ముఖచిత్రాన్ని మార్చాలని సంకల్పించింది కేంద్రం. అందుకోసం బడ్జెట్​లో పటిష్ఠ ప్రణాళికలు ప్రతిపాదించింది.

By

Published : Jul 5, 2019, 7:15 PM IST

గ్రామీణ భారతానికి సరికొత్త వన్నెలు

గ్రామీణ భారత అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత ఐదేళ్లలో గ్రామీణ వికాసానికి చేపట్టిన కార్యక్రమాలను బడ్జెట్​ ప్రసంగంలో గుర్తుచేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా లక్షల ఊళ్లను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చామని స్పష్టం చేశారు నిర్మల.

బడ్జెట్​ 2019: గ్రామీణ భారతానికి సరికొత్త వన్నెలు

"స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని మూలమూలలకు వ్యాపించి, ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. 2014లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా 9.60 కోట్ల మరుగుదొడ్లను స్వచ్ఛ భారత్​ కింద నిర్మించాం. 5.6 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారాయి. ప్రజల్లో మార్పును గమనించడమే కాదు... అధునాతన సాంకేతికత ద్వారా గ్రామాల్లో చెత్త నుంచి విద్యుత్​ తయారీ చేయడానికి సంకల్పించాం. స్వచ్ఛ భారత్ మిషన్​ ద్వారా గ్రామాల్లో చెత్త నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టాం.

'ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్' ద్వారా 2 కోట్లమంది గ్రామీణ పౌరులను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చాం. గ్రామీణ, పట్టణాల మధ్య డిజిటల్ వంతెనను నిర్మించేందుకు ప్రతి పంచాయతీలో అంతర్జాల సేవలు ఏర్పాటు చేయనున్నాం. ఈ కార్యక్రమం అంతర్జాతీయ సేవా నిధి ద్వారా పీపీపీ విధానంలో చేపట్టనున్నాం."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: పద్దు​ 2019: అంకురాల ఆశలకు కాస్త దగ్గరగా...

ABOUT THE AUTHOR

...view details