రాజస్థాన్లోని సరిహద్దు జిల్లా బాడ్మేర్ వద్ద దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి గుజరాత్-రాజస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కంచెను దాటి.. భారత భూభాగంలోకి రహస్యంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు దుండగుడు. ఇది గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.
భద్రతా బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం - BSF latest news
భారత్లోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన పాక్కు చెందిన ఓ వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమైంది.
![భద్రతా బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం BSF kills Pak intruder along IB in Barmer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8344845-thumbnail-3x2-bsf.jpg)
భద్రత బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం
'పగటిపూట పాక్ ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పడు బీఎస్ఎఫ్ విఫలమైంది. అయితే, ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో చొరబాటుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం దృష్ట్యా బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది.' అని సైన్యాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని