తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగ్లాదేశ్​ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ మృతి! - indian BSF soldier is dead

భారత్​-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ మరణించగా, మరొకరు గాయపడ్డారు. బంగ్లాదేశ్​ బలగాలే ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. బీఎస్​ఎఫ్​- బీజీబీల మధ్య దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు ఉండడం గమనార్హం.

బంగ్లాదేశ్​ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ మృతి!

By

Published : Oct 17, 2019, 4:53 PM IST

బంగాల్​లో భారత్​-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జరిగిన కాల్పుల్లో ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ మృతిచెందారు. మరో సైనికుడు గాయపడ్డారు. బోర్డర్ గార్డ్​ బంగ్లాదేశ్ (బీజీబీ) దళాలు ఈ కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం.​

ముర్షిదాబాద్​ జిల్లాలో సరిహద్దుల వెంబడి బీఎస్​ఎఫ్​ బృందం​ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధమైన చర్యలను ఆపడానికి ప్రయత్నించినప్పుడే ఈ ఘటన జరిగి ఉంటుందని వారు చెప్పారు.

ఫ్లాగ్​ మీటింగ్

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్​ భద్రతాదళ అధికారులతో బీఎస్​ఎఫ్​ ఫ్లాగ్​ మీటింగ్​ను ఏర్పాటుచేసింది.

బీఎస్​ఎఫ్​-బీజీబీల మధ్య దశాబ్దాలుగా చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. రెండు దళాల మధ్య గతంలో ఎన్నడూ ఇలా కాల్పులు జరగలేదు.

ఇదీ చూడండి: 'ఇది కార్యశక్తి.. స్వార్థశక్తికి మధ్య జరిగే పోరు'

ABOUT THE AUTHOR

...view details