కరోనా వైరస్ విస్తృతమవుతున్నవేళ.... కర్ణాటక చిక్బళ్లాపుర్ జిల్లాలో ఓ యువజంట వినూత్నంగా పెళ్లి జరుపుకుంది. అప్పెన గౌదన హల్లికి చెందిన రంజిత్, రంజిత మాస్క్లు ధరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు హాజరైన స్నేహితులు, బంధువులందరూ.. నూతన వధూవరులతో పాటూ మాస్క్లు ధరించారు.
కరోనాపై అవగాహనకు వినూత్న రీతిలో వివాహం - S. Ranjith gowda and C.S Ranjitha got marraige with mask.
కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా వివాహం జరుపుకుంది కర్ణాటక చిక్బళ్లాపుర్ జిల్లాకు చెందిన ఓ నవ జంట. మాస్క్లు ధరించి ఏడడుగులు వేశారు. ఈ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించడం విశేషం.

కరోనాపై మాస్క్లతో అవగాహన కలిపిస్తున్న యువ జంట
కరోనాపై మాస్క్లతో అవగాహన కలిపిస్తున్న యువ జంట
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకే మాస్క్లు ధరించినట్లు నవ దంపతులు తెలిపారు. కొవిడ్-19 దేశంలో విజృంభిస్తున్న వేళ ఎక్కువ మంది సమూహంగా ఏర్పడవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:ఉరికి ముందు తిహార్ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!
TAGGED:
MASK marriage