తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చుకుచుకు బోగీ బడిలో.. చకచకా పాఠాలు నేర్చుకో! - rail school in mysore

కర్ణాటకలో ఓ రైలు బోగీ.. విద్యార్థులు కోసం పాఠశాలగా మారింది. బోగీలో బడి అంటే అదేదో చిన్న పిల్లల ప్లేస్కూల్​ అనుకుంటున్నారేమో.. ఈ బడిలో ఒకటి  నుంచి ఐదో తరగతి వరకు బోధిస్తారు. ఎప్పుడూ సాధారణ తరగతి గదులనే చూసే విద్యార్థులను ఈ రైలు స్కూలు అమితంగా ఆకర్షిస్తోంది.

bogie school near mysoor government school in train bogey
చుకుచుకు బోగీ బడిలో.. చకచకా పాఠాలు నేర్చుకో!

By

Published : Jan 13, 2020, 9:17 PM IST

Updated : Jan 14, 2020, 4:37 PM IST

చుకుచుకు బోగీ బడిలో.. చకచకా పాఠాలు నేర్చుకో!

రైలులో విద్యార్థులకు పాఠాలు బోధించినట్లు.. ఎప్పుడైనా విన్నారా? వినకపోతే మైసూర్‌లోని అశోకపురం వెళ్లాల్సిందే. విద్యార్థులకు సకల సౌకర్యాలు.... ఆ రైలు బోగీలో సిద్ధంగా ఉన్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న పాఠశాల నుంచి.... విద్యార్థులను రక్షించేందుకు..ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన కృషి ఫలితమే...ఈ రైలు బడి.

మైసూర్ జిల్లా అశోకపురంలో ఓ రైలు బోగీని పాఠశాలగా మార్చారు.. అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్. కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతులు చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు శ్రీనివాస్‌. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోవడం వల్ల ఆయన ఈ వినూత్న ప్రయత్నం చేశారు.

అశోకపురం రైల్వే గ్యారేజీలో.. వినియోగంలో లేని రైలు బోగీ గురించి తెలుసుకున్న శ్రీనివాస్.. గ్యారేజీ సిబ్బందిని సంప్రదించారు. వారి అనుమతితో రైలు బోగీని అందమైన పాఠశాలగా తీర్చిదిద్దారు.

విద్యార్థులకు కావల్సిన అన్ని సౌకర్యాలు ఈ రైలు బోగీలో సమకూర్చారు. లోపలి గోడలపై అందమైన కార్టూన్ బొమ్మలు వేశారు. భోజనాల గది, శుభ్రమైన శౌచాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఒకటి నుంచి 5 తరగతి వరకు బోధిస్తున్నారు. మొత్తం 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఇదీ చదవండి:'ప్లాస్టిక్​పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'

Last Updated : Jan 14, 2020, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details