తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాభై మందితో మునిగిన పడవ- ఒకరు మృతి - bihar boat capsize

బిహార్​ భాగల్​పుర్​లోని గంగా నదిలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 50 మంది ప్రయాణిస్తున్నారు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

boat capsize in ganga river bhagalpur
గంగానదిలో పడవ ప్రమాదం- 70 మంది గల్లంతు!

By

Published : Nov 5, 2020, 12:34 PM IST

Updated : Nov 5, 2020, 2:39 PM IST

బిహార్​ భాగల్​పుర్​లో పడవ ప్రమాదం జరిగింది. యాభై మందితో ప్రయాణిస్తున్న పడవ నౌగఛియా ప్రాంతంలో గంగానదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 40 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురి జాడ తెలియలేదు. వీరంతా నీటిలో మునిగిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పడవలోని మిగిలినవారు ఒడ్డుకు వచ్చేసి ఉంటారని తెలిపారు.

స్థానిక అధికారుల సమన్వయంతో విపత్తు స్పందన దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

"పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. విపత్తు నిర్వహణ సిబ్బంది ఎలా కాపాడారో అసలు గుర్తు లేదు. పడవలో వంద మంది వరకు ఉన్నారు."

-రేణు దేవి, పడవ ప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ

ప్రమాదం జరిగిన ప్రాంతానికి భారీగా చేరుకున్న జనం
పడవ మునిగిపోయిన ప్రాంతంలో సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్థానికులు
Last Updated : Nov 5, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details