మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మరో ముందడుగు వేయనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలోని రాష్ట్రాలకు సరసమైన ధరకే విద్యుత్తును అందించేందుకు ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.
జాతీయ గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్లతో పాటు సమాచార మార్గాలు, విమానాశ్రాయాలకు సరికొత్త కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్ రంగంతోపాటు వ్యవస్థాగత సంస్కరణల కోసం త్వరలోనే ప్యాకేజీ అందించనున్నట్లు చెప్పారు.