అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ గతేడాది భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద గురువు నిత్యానందను కనిపెట్టడంలో సహకరించాలని ఇంటర్పోల్ ప్రపంచ దేశాలను కోరింది. నేరాలతో సంబంధమున్న వ్యక్తుల సమాచారాన్ని తప్పనిసరిగా తెలపాలని చెప్పే బ్లూ కార్నర్ నోటీసును నిత్యానందపై జారీచేసింది. ఓ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఈ విషయాలు వెల్లడించారు గుజరాత్ పోలీసులు.
నేరస్థులు కనిపించిన వెంటనే అరెస్టు చేయాలని చెప్పే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసును కూడా నిత్యానందపై జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.