తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రసాయన పరిశ్రమ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి - boiler blast in Gujarat latest news

గుజరాత్​ భరూచ్ జిల్లా దహేజ్​లోని రసాయన పరిశ్రమలో బాయిలర్​ పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మరో 40 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు.

Blast in a chemical company in dahej gujarat update video
రసాయన పరిశ్రమ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి

By

Published : Jun 3, 2020, 7:28 PM IST

గుజరాత్​ భరూచ్​ జిల్లా దహేజ్​ ప్రాంతంలో ఓ రసాయన పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాయిలర్​ పేలిన దుర్ఘటనలో మరో 40మంది గాయపడినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

"ఇప్పటివరకు ఐదుగురు చనిపోయినట్లు నిర్ధరించాం. కొన్ని మృతదేహాలను పరిశ్రమ నుంచి స్వాధీనం చేసుకున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రులకు తరలించాం."

- ఆర్​వీ చుందసామా, భరూచ్​ జిల్లా ఎస్పీ

రసాయన పరిశ్రమ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి

ఇదీ చూడండి:కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం- 40 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details