తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2019, 5:39 PM IST

ETV Bharat / bharat

సుప్రీం ఆదేశాలను స్వాగతించిన భాజపా- 'పరీక్ష'కు విపక్షాల పట్టు

మహారాష్ట్ర రాజకీయ వివాదంపై సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతించింది అధికార భాజపా. అజిత్​ పవార్​ ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారనే వాదనను కోర్టు నిర్ణయం బలపరుస్తోందని విశ్లేషించింది. ఫడణవీస్​ ప్రభుత్వం బల నిరూపణలో ఓడిపోతుందని ఉద్ఘాటించాయి ఎన్సీపీ, కాంగ్రెస్​.

బల పరీక్షకు విపక్షాల పట్టు

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను.. అధికార భాజపా స్వాగతించింది. అజిత్​ పవార్​.. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారనే వాదనను సుప్రీం ఆదేశాలు బలపరుస్తున్నాయని అభిప్రాయపడింది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను స్వాగతించారు భాజపా నేత శేలర్​. కాంగ్రెస్​, ఎన్సీపీ, శివసేనల ఆట ముగిసిందన్నారు. ఎన్సీపీ శాసనసభ్యులకు అజిత్​ పవార్​ విప్​ జారీ చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు.

బలనిరూపణలో ఓడిపోతుంది: ఎన్సీపీ

దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోతుందని ఉద్ఘాటించారు ఎన్సీపీ నేత నవాబ్​ మాలిక్​. ఫడణవీస్ తప్పుడు పత్రాలను చూపి.. ప్రమాణం చేశారని ఆరోపించారు. ఆయన​ వద్ద మెజారిటీకి సరిపడా సంఖ్యాబలం లేదని పేర్కొన్నారు మాలిక్​. తనకు తాను తప్పుకోవాలని.. లేదంటే విశ్వాస పరీక్షలో ఓటమిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

తక్షణమే బల పరీక్ష చేపట్టాలి: కాంగ్రెస్​

సరైన సంఖ్యాబలం లేని భాజపా ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవటంలో విఫలమవుతుందని ఉద్ఘాటించింది కాంగ్రెస్​. తక్షణమే బల పరీక్ష చేపట్టేలా సుప్రీం కోర్టు ఆదేశాలివ్వాలని కోరారు కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్​ చవాన్​.

ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధమని ఆరోపించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

ఇదీ చూడండి: 'మహా' క్యాంపు రాజకీయం- హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం

ABOUT THE AUTHOR

...view details