తెలంగాణ

telangana

'మోదీ-షా.. దేశ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారా?'

By

Published : Dec 23, 2019, 1:45 PM IST

ఎన్​ఆర్​సీ విషయంలో భాజపా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఎన్​ఆర్​సీ అమలుపై మోదీ-షా భిన్నంగా స్పందిస్తున్నారని ఆరోపించింది. దేశ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారా? అంటూ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా మండిపడ్డారు.

CONG-NRC-PM
CONG-NRC-PM

జాతీయ పౌర పట్టిక అమలుపై భిన్నంగా స్పందిస్తూ దేశాన్ని భాజపా మోసం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరు వివరణలు ఇచ్చారని కాంగ్రెస్ మండిపడింది.

"నిరసనలపై చర్చకు స్వాగతం మోదీ. దేశం మీకోసమే ఎదురుచూస్తోంది. దేశంలో పెరుగుతున్న అశాంతిపై మీరు తొలిసారి మాట్లాడిన దానిలోనే ఎన్నో అబద్ధాలు ఉండటం బాధాకరం. విభజన రాజకీయాలు చేసే మీ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?"

-కాంగ్రెస్ పార్టీ

ఎన్​ఆర్​సీపై మోదీ-షా మాటలు వేర్వేరుగా ఉన్నాయని, ఇద్దరి మధ్య సఖ్యత లేదా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.

"దేశవ్యాప్త ఎన్​ఆర్​సీపై ఎలాంటి చర్చా లేదని దిల్లీలో మోదీ అంటారు. కానీ ఝార్ఖండ్​ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్​ఆర్​సీ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ప్రధాని, హోంమంత్రి మధ్య సఖ్యత లేదా? అధికారం, పార్టీ మధ్య ఏమైనా విభేదాలున్నాయా? లేదా ఇద్దరు కలిసి దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారా? ఇంకా ఎంత కాలం?"

-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details