పశ్చిమ బంగాల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా పుంజుకుంది. ఊహించని విధంగా తృణమూల్ కాంగ్రెస్ను 22 స్థానాలకే పరిమితం చేసింది. ఎన్నికల్లో టీఎంసీ విఫలం చెందిన అనంతరం ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు కాషాయ పార్టీ కార్యకర్తలు. దీదీ ఎక్కడికి వెళ్లినా 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేస్తూ... పుండుమీద కారం చల్లుతున్నారు.
తాజాగా మరోమారు వినూత్న నిరసనకు తెరతీశారు కాషాయ నేతలు. బంగాల్లో భాజపా కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా... ముఖ్యమంత్రి మమత ఇంటికి 10 వేల 'జై శ్రీరామ్ పోస్టుకార్డు'లను పంపించనున్నట్లు భాజపా నేత అర్జున్ సింగ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి భాజపాలో చేరారు సింగ్.
జై శ్రీరామ్ నినాదాలకు 'లాఠీచార్జీ'