తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు' - Mamata Banerjee

పశ్చిమ బంగాల్​లో భాజపా కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీ​కి నిరసనగా వినూత్న ఆలోచన చేశారు భాజపా నేతలు. 10 వేల 'జై శ్రీరామ్​ పోస్టు​కార్డు'లను ముఖ్యమంత్రి మమత బెనర్జీకి పంపించనున్నట్లు ఆ పార్టీ నేత అర్జుణ్​ సింగ్​ తెలిపారు.

'దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు'

By

Published : Jun 1, 2019, 9:24 PM IST

Updated : Jun 2, 2019, 12:24 AM IST

దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు పంపుతామన్న భాజపా నేత

పశ్చిమ బంగాల్​లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా పుంజుకుంది. ఊహించని విధంగా తృణమూల్​ కాంగ్రెస్​ను 22 స్థానాలకే పరిమితం చేసింది. ఎన్నికల్లో టీఎంసీ విఫలం చెందిన అనంతరం ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు కాషాయ పార్టీ కార్యకర్తలు. దీదీ ఎక్కడికి వెళ్లినా 'జై శ్రీరామ్​' అంటూ నినాదాలు చేస్తూ... పుండుమీద కారం చల్లుతున్నారు.

తాజాగా మరోమారు వినూత్న నిరసనకు తెరతీశారు కాషాయ నేతలు. బంగాల్​లో భాజపా కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీ​కి నిరసనగా... ముఖ్యమంత్రి మమత ఇంటికి 10 వేల 'జై శ్రీరామ్​ పోస్టుకార్డు'లను పంపించనున్నట్లు భాజపా నేత అర్జున్​ సింగ్​ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి భాజపాలో చేరారు సింగ్​.

జై శ్రీరామ్​ నినాదాలకు 'లాఠీచార్జీ​'

ఇటీవల పర్గనాస్​ జిల్లా కంచ్రపారలో టీఎంసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ ప్రదేశానికి సమీపంలో భాజపా కార్యకర్తలు జై శ్రీరామ్​ అంటూ నినాదలు చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ పోస్టు​కార్డులతో నిరసన తెలుపుతున్నట్లు సింగ్​ ప్రకటించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

లోక్​సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు గాను 18 సీట్లు భాజపా కైవసం చేసుకుంది. టీఎంసీకి 22 స్థానాలకే పరిమితమైంది. అనంతరం కొంత మంది టీఎంసీ నాయకులు భాజపా గూటికి చేరారు.

ఇదీ చూడండి:రక్షణ వ్యవహారాలపై రాజ్​నాథ్​ సమీక్ష

Last Updated : Jun 2, 2019, 12:24 AM IST

ABOUT THE AUTHOR

...view details