తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 57 మందితో భాజపా తొలి జాబితా

దిల్లీ శాసనసభ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది భాజపా. 70 స్థానాల్లో పోటీ చేయనుండగా.. 57 మందితో తొలి జాబితాను ప్రకటించింది. జాబితాలో 11 మంది ఎస్సీలు, నలుగురు మహిళా అభ్యర్థులకు చోటు కల్పించింది.

By

Published : Jan 17, 2020, 6:11 PM IST

BJP releases first list of 57 candidates for Delhi polls
దిల్లీ దంగల్​: 57 మందితో భాజపా తొలి జాబితా

దిల్లీ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను.. భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో... తొలి జాబితాను భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ప్రకటించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, మాజీ మేయర్లు రవీందర్ గుప్తా, యోగేందర్ చందోలియాతో పాటు ఆప్‌ మాజీ నేత కపిల్‌ మిశ్రాకు తొలి జాబితాలో స్థానం దక్కింది. ఈ జాబితాలో 11 మంది ఎస్సీలు, నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.

70 శాసనసభ స్థానాలున్న దిల్లీలో ఫిబ్రవరి 8న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

ఇదీ చూడండి: మోదీ భారత పౌరసత్వంపై ఆర్​టీఐ దరఖాస్తు

ABOUT THE AUTHOR

...view details