పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. బాలీవుడ్ నటీనటులతో ప్రచారం చేయించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం మూడు గంటల పాటు ప్రత్యేక సమావేశం నిర్వహించింది భాజపా. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా 70 మంది బాలీవుడ్ తారలు ఈ భేటీలో పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సమావేశానికి హాజరైన వారిలో భూషణ్ కుమార్, ప్రసూన్ జోషీ, అనూ మాలిక్, కైలాష్ కేర్, షాన్, కునాల్ కోహ్లీ, రణ్వీర్ సోరే, రితేశ్ సిద్వాణీ, రాజ్కుమార్ సంతోషీ, సురేస్ వాడేకర్, నీరజ్ శ్రీధర్లు ఉన్నారు.సీఏఏకు ప్రజల మద్దతు పెంచేందుకు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడం, ఇంటింటి ప్రచారం వంటి ప్రణాళికలను ఆవిష్కరించింది భాజపా.