తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జులై 2న

జులై 2న భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలు, కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీకి ఎంపీలు ఘన సన్మానం చేయనున్నారని అనధికార సమాచారం.

By

Published : Jun 30, 2019, 9:42 PM IST

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

బడ్జెట్ సమావేశాల సందర్భంగా జులై 2న భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బిల్లుల ఆమోదం, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఎంపీలకు మోదీ తెలపనున్నారని సమాచారం.

జీ-20 సదస్సులో పాల్గొని స్వదేశానికి చేరుకున్న ప్రధానికి ఈ సమావేశం వేదికగా ఎంపీలు ఘన సన్మానం చేయనున్నారని తెలుస్తోంది.

భాజపా సీనియర్ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలు లేకుండా ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. 75 ఏళ్లు పైబడిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న పార్టీ నిబంధనతో వీరిద్దరు ఎన్నికల బరిలో నిలబడలేదు.

భాజపా పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జూన్ 25నే జరగాల్సి ఉంది. భాజపా రాజస్థాన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మదన్​ లాల్ సైనీ మృతితో వాయిదా పడింది.

ఇదీ చూడండి: మన్​ కీ బాత్​ 2.0: ప్రజా ఉద్యమంలా జల సంరక్షణ

ABOUT THE AUTHOR

...view details