బడ్జెట్ సమావేశాల సందర్భంగా జులై 2న భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బిల్లుల ఆమోదం, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఎంపీలకు మోదీ తెలపనున్నారని సమాచారం.
జీ-20 సదస్సులో పాల్గొని స్వదేశానికి చేరుకున్న ప్రధానికి ఈ సమావేశం వేదికగా ఎంపీలు ఘన సన్మానం చేయనున్నారని తెలుస్తోంది.