తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2019, 4:20 PM IST

Updated : Oct 18, 2019, 5:51 PM IST

ETV Bharat / bharat

నోబెల్​ విజేత అభిజిత్​పై కేంద్ర మంత్రి విమర్శలు!

కేంద్రమంత్రి పీయూష్​ గోయెల్ నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీపై సునిశిత విమర్శలు చేశారు. అభిజిత్ వామపక్షవాది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పథకమైన 'న్యాయ్'​ను అభిజిత్ సమర్థించారని, అయితే భారత ప్రజలు ఆయన భావజాలాన్ని తిరస్కరించారని వ్యాఖ్యానించారు.

నోబెల్​ విజేత అభిజిత్​పై కేంద్ర మంత్రి విమర్శలు!

నోబెల్​ విజేత అభిజిత్​పై కేంద్ర మంత్రి విమర్శలు!

నోబెల్ విజేత భారతీయ-అమెరికన్​ ఆర్థికవేత్త అభిజిత్​ బెనర్జీ వామపక్షవాది అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్​ గోయల్ పుణెలో​ వ్యాఖ్యానించారు. నోబెల్​ దక్కడంపై అభిజిత్​ను అభినందిస్తూనే... ఆయనపై సునిశిత విమర్శలు గుప్పించారు.

"కాంగ్రెస్ పథకమైన 'న్యాయ్​'(పేదరిక నిర్మూలన పథకం)కు అభిజిత్​ బెనర్జీ మద్దతు ఇచ్చారు. అయితే భారత ప్రజలు ఆయన భావజాలాన్ని తిరస్కరించారు."
- పీయూష్​ గోయెల్​, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి

అభిజిత్ బెనర్జీ ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం.. దేశ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్​లో పుంజుకునే అవకాశం లేదని విశ్లేషించారు.

ఇదీ చూడండి:ఎన్నికల్లో విజయం కోసం భాజపా చేస్తున్న మ్యాజిక్ ఇది!

Last Updated : Oct 18, 2019, 5:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details